
Mexico Earthquake : మెక్సికో దేశంలోని చియాపాస్ తీరంలో పెద్ద భూకంపం వచ్చింది. మొదట దీని తీవ్రత 7.4గా అనుకున్నా, తర్వాత 7.3గా గుర్తించారు. భూమికి 15 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం మొదలైంది.
దీని వల్ల మెక్సికోతో పాటు పక్కనే ఉన్న గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ దేశాల్లో కూడా భవనాలు బాగా ఊగాయి. ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా ఆస్తి నష్టం జరగలేదు. అయితే, సముద్రంలో అలలు ప్రమాదకరంగా వచ్చే అవకాశం ఉందని సునామీ హెచ్చరిక జారీ చేశారు. భూకంపం వచ్చిన చోటుకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర తీరాల్లో అలలు అర మీటర్ నుంచి ఒక మీటర్ ఎత్తు వరకు రావచ్చు అని అధికారులు చెప్పారు.
Also Read : పాకిస్థాన్లో ఘనంగా జగన్నాథుని రథయాత్ర,, వేలాది మంది భక్తుల సమక్షంలో!
మెక్సికో నేవీ అధికారి మాట్లాడుతూ, సముద్రంలో నీటి మట్టం అర మీటరు కంటే ఎక్కువ పెరగకపోవచ్చని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయినా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు సముద్రం దగ్గరికి వెళ్లవద్దని కోరారు. ఆ తర్వాత కూడా చిన్న చిన్న భూకంపాలు కొన్ని సార్లు వచ్చాయి.
గ్వాటెమాలా సిటీలో భూమి కంపించడంతో జనం ప్రాణభయంతో ఇళ్లలోంచి బయటకు పరుగు తీశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్న వాళ్లను కూడా బయటకు పంపించేశారు. ఎనిమిదో అంతస్తులో ఉంటున్న ఒక వ్యక్తి, “భూమి ఊగడం ఆగలేదు, చాలా భయమేసింది, వెంటనే కిందకు పరిగెత్తాను” అని చెప్పాడు. మరో వ్యక్తి, “ఇటీవల వెనిజులాలో జరిగిన భూకంపాల జ్ఞాపకాలు గుర్తొచ్చి భయం వేసింది” అని చెప్పాడు. వెనిజులాలో కొన్ని రోజుల క్రితమే రెండు పెద్ద భూకంపాలు వచ్చి భవనాలు కూలిపోయి చాలా నష్టం జరిగిన సంగతి మనకు తెలిసిందే.
Also Read : ట్రంప్ మరో సంచలనం.. వలసదారులకు దిమ్మతిరిగే షాకిచ్చిన ట్రంప్!









