ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఛలో సంసద్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు లోక్ సభ మార్చ్‌కు అనుమతి లేదని చెప్పడంతో బారీకేడ్లను దాటి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బలగాలను పెట్టి సీజేపీ నిరసన కారులను అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం పెరిగి తోపులాట అయ్యింది. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ప్రస్తుతం పోలీసులు కొందరు నిరసన కారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read : ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: పార్లమెంట్ ముట్టడికి ‘సీజేపీ’ పిలుపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కేఅరెస్ట్

ఈ ర్యాలీ దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో హైఅలర్ట్‌లో ఉంచారు. భారీగా జనాలు గుమిగూడటాన్ని కూడా నిషేధించారు. జంతర్‌మంతర్‌ వద్ద తప్ప మిగతా ప్రదేశాల్లో ఎక్కడ కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉండద్దని పోలీసులు హెచ్చరించారు. అలాగే మధ్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Also Read : త్రిపుర డీజీపీ మృతి.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య!