
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆగస్టు 20 నుంచి 30 వరకు యునైటెడ్ కింగ్డమ్ (UK), అమెరికా (USA)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 20 న రాత్రి 12:30 గంటలకు న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో లండన్కు బయలుదేరుతారు. ఉదయం 7:00 గంటలకు (UK స్థానిక కాలమానం) లండన్ చేరుకుంటారు.
Also Read : రూపారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్… ’బాబు’ అనే పిలుపే వారిని పట్టించింది!
ఆగస్టు 21ఉదయం 10:30 గంటలకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను సందర్శిస్తారు. సాయంత్రం 6:00 గంటలకు ఎమిరేట్స్ స్టేడియంలో EPL ఫుట్బాల్ ప్రెజెంటేషన్కు హాజరవుతారు. ఆగస్టు 22 ఉదయం 10:30 గంటలకు కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశమవుతారు. ఉదయం 11:30 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్లోని సెనేట్ హౌస్ను సందర్శిస్తారు.సాయంత్రం 4:00 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్ను సందర్శిస్తారు.
ఆగస్టు 23న లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్కు విమాన ప్రయాణం. ఆగస్టు 24 ఉదయం 10:30 గంటలకు హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎంఐటీ క్యాంపస్కు వెళ్లానున్నారు. ఆగస్టు 25న ఉదయం 10.30 గంటలకు బోస్టన్లో నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ను సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశం అవుతారు. అనంతరం… రాత్రి 7 గంటలకు బోస్టన్ నుంచి న్యూయార్క్ సిటీకి సీఎం పయనమవుతారు. ఆగస్టు 26న న్యూయార్క్లో రాత్రి 7 గంటలకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరతారు. ఆగస్టు 30న హైదరాబాద్కు చేరుకుంటారు.
Also Read : రాజీనామా చేసి మళ్లీ గెలవండి చూద్దాం… సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత సంచలన సవాల్









