
Synthetic Milk : మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపిన భారీ కృత్రిమ పాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో జరిగిన ఈ దారుణంపై పోలీసులు, అన్న సురక్ష, ఔషధ పరిపాలన సంస్థ (FDA) జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సేల్స్ రిజిస్టర్లను పరిశీలించగా, గత ఆరు నెలల్లోనే దాదాపు 2,30,470 కిలోల నాసిరకం పాల పొడిని కల్తీ కోసం ఉపయోగించినట్లు తేలింది. ఈ భారీ పరిమాణంలో ఉన్న పాల పొడి ద్వారా సుమారు 23,04,070 లీటర్ల కృత్రిమ పాలను తయారు చేశారని, వీటి విలువ దాదాపు 9 కోట్ల 21 లక్షల 62 వేల 800 రూపాయలుగా అంచనా వేశారు.
Also Read : కోర్టులో క్షుద్రపూజలు.. జడ్జి కుర్చీపై మంత్రాలు : మహిళ అరెస్ట్ !
A man sold 2.3 crore litres of synthetic milk made with Nirma detergent powder in Maharashtra without getting caught:
if it would have been any Middle East, country or Singapore or Thailand, he would have been awarded a death penalty. https://t.co/QbFqbywUZn
— Bose (@DebashishBose_) July 14, 2026
ఈ కేసు విచారణలో అత్యంత తీవ్రమైన విషయం ఏమిటంటే, నిందితులు ప్రతీ 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల కృత్రిమ పాలను కలిపి (10% కల్తీ నిష్పత్తి) విక్రయించేవారు. ఈ 10% నిష్పత్తి ఆధారంగా, భూమ్ ప్రాంతంలోని పాల సేకరణ కేంద్రాల నుండి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు ఏకంగా 2.3 కోట్లకు పైగా (23 మిలియన్లు) లీటర్ల కల్తీ పాలు సరఫరా అయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ కృత్రిమ పాలు అసలైన పాలలా కనిపించేందుకు ,అందులో అవసరమైన కొవ్వు శాతాన్ని (ఫ్యాట్) చూపించడానికి నిందితులు డిటర్జెంట్ పౌడర్, పామ్ ఆయిల్, అత్యంత నాసిరకం రసాయన పొడులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ అత్యంత సున్నితమైన కేసులో పోలీసులు ఏడుగురు వ్యక్తులపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదై ఎనిమిది రోజులు గడుస్తున్నా నిందితులందరూ ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందం (SIT) ఏర్పాటు చేసి, అనుమానిత స్థావరాలపై నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు.
Also Read : 9ఏళ్ల చిన్నారికి చనిపోయేంత కష్టం ఏమొచ్చింది?
డిటర్జెంట్, పామ్ ఆయిల్ కలిపిన ఈ రసాయన పాలను నిరంతరం తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటాయని, ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధుల ప్రాణాలకు ఇది తీవ్ర ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఆహార భద్రతా చట్టం కింద పాలల్లో ఇటువంటి ప్రాణాంతక కల్తీకి పాల్పడే వారికి రూ.10 లక్షల వరకు జరిమానా, జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు విధించే అవకాశముంది.
ఈ ఘటనపై భూమ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ శ్రీగణేష్ కనగుడే మాట్లాడుతూ.. “దాడి సమయంలో అధికారులు 61 బస్తాల కల్తీ పాల పొడిని స్వాధీనం చేసుకున్నారు. భూమ్ ప్రాంతంలోని పలు డెయిరీ యూనిట్లకు కల్తీ పాల పొడిని బాలాసాహెబ్ గోడ్గే సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దందాలో పలు పాల సేకరణ కేంద్రాల ప్రమేయం ఉన్నట్లు గుర్తించాం. అయితే పాల పొడితో తయారు చేసిన వేల లీటర్ల కల్తీ పాలను కొనుగోలు చేసిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. పశువుల మేత అమ్మకం ముసుగులో ఈ రాకెట్ నడుస్తోంది. భూమ్ తాలూకా నుండి ప్రతిరోజూ లక్షల లీటర్ల పాలు ఎగుమతి కావడంతో పాటు దాదాపు 70 నుండి 80 టన్నుల కోవా ఉత్పత్తి అవుతుంది, అందుకే ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది” అని వెల్లడించారు.








