Earthquake: పశ్చిమ ఇరాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంపం భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం కహ్రిజ్ నగరానికి పశ్చిమంగా సుమారు 54 కిలోమీటర్ల దూరంలోనూ, జవాన్‌రుడ్ నగరానికి దక్షిణంగా 33 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నట్లు గుర్తించారు. సుమారు 7 లక్షల 66 వేల జనాభా ఉన్న కహ్రిజ్, దాదాపు 38 వేల 600 జనాభా ఉన్న జవాన్‌రుడ్ ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : FIFA World Cup : ఫిఫా చరిత్రలో సరికొత్త అధ్యాయం: ప్రపంచకప్ విజేతలకు ‘ఛాంపియన్‌షిప్ రింగ్స్’!

Also Read : పాకిస్థాన్‌లో ఘనంగా జగన్నాథుని రథయాత్ర.. వేలాది మంది భక్తుల సమక్షంలో!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.