Transgenders Attack : ముంబై లోకల్ ట్రైన్‌లో ఘోరం జరిగింది. రాత్రిపూట ప్రయాణిస్తున్న ట్రైన్ బోగీలో ఒక ప్రయాణికుడికి, ట్రాన్స్‌జెండర్లకు మధ్య గొడవ జరిగి అది కాస్తా దాడి వరకు వెళ్ళింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఒక ప్రయాణికుడిని కొడుతూ కనిపిస్తున్నారు.

Also Read : భారత్‌లో డెంగ్యూ మహమ్మారికి చెక్: తొలి వ్యాక్సిన్ ‘క్యుడెంగా’కు DCGI ఆమోదం

అసలు వాళ్ళ మధ్య ఏం గొడవ జరిగిందో ఇంకా ఎవరికీ తెలియదు. రోజు లక్షలాది మంది ప్రయాణించే ముంబై లోకల్ ట్రైన్లలో ఇలాంటి దాడులు జరుగుతుండటంతో, సాధారణ ప్రయాణికులు చాలా భయపడుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు గమనించారు, అసలు గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

ముంబై లోకల్ ట్రైన్లలో ఇలాంటి గొడవలు జరగడం ఇప్పుడు కొత్తేమీ కాదు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరు యువకులపై దాడి జరిగింది, మరోచోట రెండు గ్రూపుల మధ్య గొడవ అయ్యింది. అంతకుముందు కూడా చర్చ్‌గేట్-విరార్ ట్రైన్‌లో ప్రయాణికుల మధ్య గొడవ జరిగిన వీడియో ఒకటి అందరినీ భయపెట్టింది. ఇలా ట్రైన్లలో వరుసగా గొడవలు జరుగుతుండటంతో, అందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటామా లేదా అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Also Read : పార్లమెంటులో కొత్త బిల్లు.. ఇలా చేస్తే మూడేళ్ల జైలు శిక్ష!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.