Indonesia : ఇండోనేషియాలోని బాలి స‌మీపంలో ఫెర్రీలో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది మంటల్లో చిక్కుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ ఫెర్రీలో సుమారు 131మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కోస్టల్‌ సిబ్బంది. ఇప్పటివరకు 106 మందిని సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు. మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సిబ్బంది శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. కోస్టల్‌ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Also Read : రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు… మహిళ వ్యాపారవేత్త సామ్రాజ్యం ధ్వంసం

అయితే ఫెర్రీ నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ ఎగిసి పడుతుండంటంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫెర్రీ నుంచి నీళ్లలో దూకిన వారిని రక్షించడానికి హెలికాఫ్టర్‌ను రంగంలోకి దించారు. కాగా, ఫెర్రీలో ప్రయాణీకులతో పాటు 44 వాహనాలు, 53 మోటారు సైకిళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం దాటికి అవన్నీ కాలి బూడిదయ్యాయని వారు వెల్లడించారు. కాగా ఈ ఫెర్రీ బాలిలోని పడాంగ్ బాయి పోర్టు నుంచి లెంబార్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Also Read : సీక్రెట్ సర్వీస్ చెప్పినట్లే వింటా: విమానం మార్పుపై ట్రంప్ స్పష్టత

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.