
Women Farmers : బెంగళూరు సమీపంలోని బిడది వద్ద ప్రతిపాదిత టౌన్షిప్ ప్రాజెక్ట్ భూసర్వే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం బిడదిలోని మందలహల్లి గ్రామంలో సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మహిళా రైతులు చీపుర్లు పట్టుకుని నిరసన తెలిపారు. డిప్యూటీ కమిషనర్ (డీసీ) నుంచి ఎలాంటి లిఖితపూర్వక అనుమతి పత్రాలు లేకుండా సర్వే కొనసాగనిచ్చేది లేదని స్పష్టం చేస్తూ, ప్రభుత్వ సర్వే బృందాన్ని, వారి వాహనాలను నిరసనకారులు అడ్డుకున్నారు.
WATCH | Women #farmers strike #survey officials’ vehicles with brooms as protesters demand the Deputy Commissioner’s permission letter during a standoff over the land survey for the proposed #Bidadi township project on Monday, July 13. #Karnatakanews #Bidaditownship pic.twitter.com/a2crSoSKfL
— Deccan Herald (@DeccanHerald) July 13, 2026
Also Read : దొంగతనం చేయబోయి దొరికిపోయాడు.. 9 కిలోమీటర్లు వేలాడుతూనే..!
బైరమంగల, కంచనగరనహల్లి గ్రామ్ పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో, హరిత శాలువాలు ధరించిన వందలాది మంది రైతులు అధికారుల వాహనాలను చుట్టుముట్టారు. “ముందు డీసీ గారి అనుమతి లేఖ చూపించండి, ఆ తర్వాతే సర్వే చేయండి” అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా రైతులు అధికారుల వాహనాలను చీపుర్లతో కొడుతూ తమ నిరసన తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ రైతులు అధికారులను కదలకుండా చుట్టుముట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
#Karnataka officials beaten with brooms !#Bengaluru: DK Shivakumar Govt’s move to acquire fertile land in #Bidadi for a township triggered protests at Mandalahalli after women farmers allegedly attacked survey officials with brooms and damaged vehicles during a land survey.… pic.twitter.com/WXNsbwba6h
— TOI Bengaluru (@TOIBengaluru) July 13, 2026
ఈ ప్రాంతంలో భూసర్వేపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచనల మేరకు త్వరలోనే సిఎం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే హెచ్.సి. బాలకృష్ణ రైతు నాయకులకు హామీ ఇచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే ఈ సంఘటన జరగడం గమనార్హం. హామీ ఇచ్చిన సమావేశం జరగకముందే, భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే అధికారులను పంపడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన మాట తప్పిందని వారు ఆరోపించారు.
గంటల తరబడి సాగిన ఈ ముట్టడిలో డిప్యూటీ కమిషనర్ అధికారిక లేఖ చూపే వరకు సర్వేను అంగీకరించేది లేదని రైతులు భీష్మించుకూర్చున్నారు. దీంతో అధికారులు, పోలీసుల రక్షణ వలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. నిరసనకారులు వాహనాలను ఘెరావ్ చేసి, భూసేకరణ ప్రక్రియకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్ణాటక ప్రాంత రైతు సంఘం (KPRS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశవంత టీ స్పందిస్తూ, ప్రభుత్వ తీరును రైతాంగానికి జరిగిన “ద్రోహం”గా అభివర్ణించారు.
చర్చలు జరుపుతామని చెప్పి, దానికి విరుద్ధంగా పోలీస్ బలగాలను ఉపయోగించి భూసేకరణ సర్వేలు చేయడం ప్రజాస్వామ్యయుత నిరసనలను అణచివేయడమేనని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే సర్వే అధికారులను, పోలీస్ బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సారవంతమైన, బహుళ పంటలు పండే వ్యవసాయ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతుల సమస్యలను వినేందుకు తక్షణమే ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
ఒకవేళ ప్రభుత్వం సర్వేను ఇలాగే బలవంతంగా కొనసాగిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులను సమీకరించి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కేపీఆర్ఎస్ హెచ్చరించింది. కాగా, ఈ నిరసన సందర్భంగా కేంపశెట్టిదొడ్డి గ్రామానికి చెందిన కృష్ణప్ప అనే రైతుపై పోలీసులు దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని కూడా రైతు సంఘం నాయకులు ఆరోపించారు.
Also Read : విరాళాల వివాదం.. అయోధ్యలో తగ్గిన భక్తుల రద్దీ!









