
National Handloom Day : జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక గౌరవం దక్కింది. ఏపీ రాజ్యసభ ఎంపీలు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.
మన చేనేత కళాకారుల హార్డ్ వర్క్, స్కిల్స్ను అప్రిషియేట్ చేస్తూ, ఏపీ లోనే చాలా ఫేమస్ అయిన మంగళగిరి చేనేత వస్త్రాన్ని ప్రధానికి స్వయంగా అందించారు. ప్రస్తుతం ఈ మంగళగిరి నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : UPI యూజర్లకు బిగ్ షాక్…. ట్రాన్సెక్షన్స్పై ఛార్జీలు.!

పీఎం మోదీకి ఈ స్పెషల్ వస్త్రాన్ని అందించడం ద్వారా మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఇంపార్టెన్స్తో పాటు లోకల్ ఆర్టిస్ట్స్ టాలెంట్ను నేషనల్ లెవెల్లో మరోసారి ప్రౌడ్గా చూపించినట్లయింది. ప్రభుత్వం నుంచి చేనేత రంగానికి, కార్మికులకు దక్కుతున్న ఫుల్ సపోర్ట్కు ఈ మీటింగ్ ఓ మంచి ఎగ్జాంపుల్గా నిలిచింది.
మంగళగిరి చేనేత వస్త్రాలకు మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. కేవలం చీరలే కాకుండా ఈ రోజుల్లో మంగళగిరి కాటన్ , సిల్క్ క్లాత్తో కుర్తీలు, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ కుర్తాలు కూడా ఎక్కువగా తయారుచేస్తున్నారు. దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ కూడా లభించింది.
Also Read : తిరుమలలో హార్దిక్ పాండ్యా కేశదానం: గుండు ఎందుకు చేయించుకుంటారు?.. కేశదానం వెనుక అసలు రహస్యం ఇదే..!









