Indonesia :  ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు కనీసం 47 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రధాన భూకంపం తర్వాత వరుసగా పదుల సంఖ్యలో ప్రకంపనలు రావడంతో వందలాది ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి.

భూమికి కేవలం 15 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా భూకంపాలు భూమి ఉపరితలానికి ఎంత తక్కువ లోతులో వస్తే, దానివల్ల జరిగే ధ్వంసం అంత ఎక్కువగా ఉంటుంది. ఈ భూకంపం వచ్చిన సమయంలో అత్యధికులు తమ ఇళ్లలో నిద్రపోతున్నారని, భవనాల శిథిలాలు వారిపై కూలిపోవడంతోనే ఎక్కువమంది చనిపోయారు.

ప్రధాన భూకంపం ముగిసిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో వరుసగా ప్రకంపనలు కొనసాగాయి. పశ్చిమ ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో భూమికి 163 కిలోమీటర్ల లోతులో 6.4 తీవ్రతతో మరొక ప్రకంపన నమోదైనట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ ప్రకారం దీని తీవ్రత 6.9గా నమోదైంది. మౌమేరే ఓడరేవు వద్ద తీసిన వీడియోల్లో పోర్టు భవనానికి చెందిన పెద్ద పెద్ద కాంక్రీట్ ముక్కలు విరిగిపడి పడవల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపై పడటం కనిపించింది. అక్కడి షిప్‌కు అనుసంధానించిన దారి కూడా విరిగిపోవడంతో కొందరు ప్రయాణికులు సముద్రంలో పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.