పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ప్రపంచ దేశాలు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుంటే.. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేపట్టింది. క్షిపణులు, డ్రోన్ల సాయంతో కువైట్, బహ్రెయిన్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. అయితే ఇరాన్లోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడి చేశాయి. దీనికి ప్రతీకారంగానే తాము ఇప్పుడు అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నామని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ అధికారికంగా ప్రకటించింది.
ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు తమ దేశంపై పడకుండా ఉండేందుకు కువైట్ రక్షణ వ్యవస్థలు వెంటనే స్పందించాయి. తమకు ఉన్న అత్యాధునిక డిఫెన్స్ వ్యవస్థల సాయంతో ఇరాన్ పంపిన డ్రోన్లను, క్షిపణులను గాలిలోనే అడ్డుకుంటున్నట్లు కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ వెల్లడించారు. ఈ అకస్మాత్తు దాడుల వల్ల అక్కడ ఉన్న అమెరికా సైనికులు, ఇతర దేశాలకు చెందిన సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING : ఘోరం.. రెండు బస్సులు ఢీ… ఏడుగురు మృతి!
ఇది కూడా చూడండి: భక్తి ముసుగులో IIT కామాంధుడు….ప్రవచనాలు చెబుతూ అమ్మాయిలతో రాసలీలాలు!










