
-RA
VI PRAKASH
CJP Protests : ఈ వీడియో…ఢిల్లీ నుంచి వచ్చింది…ఈ విజువల్స్ చూసి నా గుండె తరుక్కుపోయింది..ఈ వీడియోను రిపీటెడ్గా చూశాను.చూసిన ప్రతీసారి…నాకు మాటలు రాలేదు…కోట్లాది మంది తల్లిదండ్రుల్లాగే…నేను కూడా ఆ సంఘటన గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను…ఒకవేళ ఈ వీడియోలో ఉన్నది నా కూతురే అయితే?..ఆ ఆలోచనే నన్ను తీవ్రంగా కలిచివేసింది…వంద హెడ్లైన్స్ చెప్పలేని నిజాన్ని…ఒకే ఒక్క గొంతు… ఒకే ఒక్క ముఖం… ఒకే ఒక్క ప్రశ్న…కళ్లకు కడుతుంది!
ఈరోజు…జంతర్ మంతర్ నుంచి…వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు మార్చ్ చేశారు…కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. జంతర్ మంతర్ ఇలాంటి ఉద్రిక్తతను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు!ముందుకు దూసుకెళ్తున్న స్డూడెంట్స్పై…పోలీసులు ఉక్కుపాదం మోపారు.లాఠీచార్జీలు… టియర్ గ్యాస్ ప్రయోగాలు… రక్తం చిందిన విజువల్స్ ఇవాళ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి! విద్యార్థుల ప్రొటెస్ట్ను అణచివేయడానికి ఇంత క్రూరత్వమా? పోలీసులు దురుసు ప్రవర్తనపై దేశం నిప్పులు చెరుగుతోంది!
Also Read : ఢిల్లీలో హైటెన్షన్…మోదీ ఇంటి వద్ద కాంగ్రెస్ నిరసన!
ఈ టాపిక్పై మరింత చర్చించే ముందు…ఆ అమ్మాయిని మరోసారి చూద్దాం! నా మాటలు పక్కన పెట్టి,… ఓసారి ఆ బిడ్డ ఆవేదన వినండి.ఎందుకంటే… చరిత్ర ఎప్పుడూ నాయకులు చేసే భారీ ప్రసంగాల్లో ఉండదు,గుండెల్ని పిండేసే ఇలాంటి ఒక్క ప్రశ్న చరిత్రలో నిలిచిపోతుంది!ఆ అమ్మాయి ఏమడుగుతోందో మీరే చూడండి!
మీకు ఇప్పుడు మరొక వీడియో చూపిస్తాను.ఆమె హుందాగా, శాంతియుతంగా నిలబడాల్సిన ఒక యువ విద్యార్థిని…ఆమె వయసు మహా అయితే పద్దెనిమిదో లేక పంతొమ్మిది ఏళ్లో ఉంటాయి.ఢిల్లీ పోలీసుల ముందు నిలబడి…తీవ్ర ఆగ్రహంతో…నేరుగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతోంది…”ఆప్ హమే క్యోం మార్ రహే హైన్?” మమ్మల్ని ఎందుకు కొడుతున్నారని అడుగుతోంది…అంతేకాదు… ఒక మహిళా సామాజిక కార్యకర్త పోలీసులను నిలదీస్తోంది!ఆమె అడిన ప్రశ్న వింటే మీ ఒళ్లు గగుర్పొడుస్తుంది…”ఆప్ లడ్కియోన్ కే కప్డే క్యూన్ ఫాడ్ రహే హైన్?” మీరు అమ్మాయిల బట్టలు ఎందుకు చింపేస్తున్నారు? కెమెరా ముందు… చిరిగిపోయిన బట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి!రణరంగంగా మారిన ఆ నిరసనలో… ఈ దృశ్యాలు కలకలం రేపుతున్నాయి, సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి! ఈ వీడియోను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి…
నేను మీకు చూపించబోయే నెక్స్ట్ వీడియో…బహుశా ఇవాళ్టి ప్రొటెస్ట్లో…అత్యంత పవర్ఫుల్ వీడియో…రోమాలు నిక్కబొడుచుకునే విజువల్! చుట్టూ డజన్ల కొద్దీ పోలీసులు… ఆ ఖాకీల చక్రబంధంలో ఒకే ఒక్క విద్యార్థి!ఆ యువకుడిపై లాఠీ దెబ్బలు వర్షంలా కురుస్తున్నాయి! కానీ… అతడు అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదల్లేదు!భయపడి పారిపోవడం లేదు… వెనక్కి తగ్గడం లేదు!పైగా, లాఠీలు ఝుళిపిస్తున్న పోలీసుల కళ్లల్లోకి కళ్లు పెట్టి మరీ చూశాడు…! పోలీసులతో ఏమన్నాడో చూశారా..? “మారో… ముఝే ఔర్ మారో!” కొట్టండి… నన్ను ఇంకా కొట్టండి!మళ్లీ అదే మాట అంటున్నాడు…”మారో… ముఝే ఔర్ మారో!” ఈ విజువల్ చూస్తుంటే… నాకు ఈ మోడర్న్ వరల్డ్ హిస్టరీలోనే అత్యంత సంచలనాత్మకమైన ఒక పోరాటం గుర్తొచ్చింది!1989లో బీజింగ్లోని టియాన్మెన్ స్క్వేర్ నిరసనల్లో… మిలిటరీ ట్యాంకుల ముందు ఒంటరిగా నిలబడిన చైనీస్ యువకుడి విజువల్ గుర్తొస్తోంది!దేశాలు వేరు కావచ్చు…సందర్భాలు, పరిస్థితులు వేరు కావచ్చు…కానీ దృశ్యం మాత్రం ఒక్కటే!తనపై విరుచుకుపడుతున్న అణచివేత శక్తులను ఎదిరిస్తూ… ఒక యువకుడు కొండంత ధైర్యంతో నిలబడిన దృశ్యం! ఈ పవర్ఫుల్ విజువల్ను మీరే చూడండి…
ఇప్పుడు మరో పవర్ఫుల్ వీడియో చూద్దాం…మేము అసలు లాఠీచార్జే చేయలేదు…విద్యార్థులపై చెయ్యి కూడా చేసుకోలేదు” అంటూ ఢిల్లీ పోలీసులు చెబుతున్న అబద్ధాల ముసుగును ఈ వీడియో బట్టబయలు చేసింది! నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు… అసలు నిజమేంటో ఈ దృశ్యాలే దేశానికి చాటి చెబుతున్నాయి!
ఈరోజు… సోషల్ మీడియా తెరిస్తే చాలు, ఇలాంటి వందలాది వీడియోలే కనిపిస్తున్నాయి.నిరసనకారులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దాని ప్రకారం… ఇవాళ్టి పార్లమెంట్ మార్చ్ను ఆపడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది.కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ కట్ చేశారు… మెట్రో స్టేషన్లు మూసేశారు… పోలీసులు భారీగా బారికేడ్లు పెట్టడమే కాకుండా, టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి.ఇన్ని ఆటంకాలు ఎదురైనా… వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు దూసుకొచ్చారు. ఇటీవలి కాలంలో దేశ రాజధాని నడిబొడ్డున ఇంత భారీ స్థాయిలో విద్యార్థులు తరలిరావడం ఇదే మొదటిసారి.’కాక్రోచ్ జనతా పార్టీ’ షేర్ చేసిన డ్రోన్ వీడియోలో కూడా… కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ పరిసరాల్లో వేలాది మంది నిరసనకారులు గుమిగూడిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.మరికొన్ని వీడియోల్లో విద్యార్థులు “జై భీమ్”, “వందేమాతరం” అంటూనినాదాలు చేస్తూ పార్లమెంట్ వైపు దూసుకెళ్తున్నారు.
రెండు రోజుల క్రితం… సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఢిల్లీ పోలీసులు హాస్పిటల్కు తరలించారు.కానీ ఈరోజు జరుగుతున్న నిరసన చూస్తుంటే… ఇది కేవలం ఒక్క వ్యక్తికో, ఒక సమస్యకో పరిమితమైనట్టు కనిపించట్లేదు…రోడ్లపైకి వచ్చిన ఈ వేలాది మంది విద్యార్థులను చూస్తుంటే… దేశంలోని యువత ఎంత ఆగ్రహంతో ఉన్నారో క్లియర్గా తెలుస్తోంది, తమ స్వరాన్ని వినిపించడానికి వారు ఎంత పట్టుదలగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read : ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఎలాగో మీకు తెలుసా?
ఇప్పుడు నేను మీకు చూపించబోయే వీడియో… ఈరోజు జరిగిన నిరసనల్లోనే అత్యంత బాధాకరమైన దృశ్యాన్ని చూపిస్తోంది..గుండెల్ని పిండేసే విజువల్ ఇది.ఈ వీడియోను ‘న్యూస్ పించ్’ జర్నలిస్ట్ అభినవ్ పాండే క్యాప్చర్ చేశారు.ఈ వీడియోలో… తీవ్రంగా గాయపడిన ఒక విద్యార్థి మనకు కనిపిస్తాడు.ఒళ్లంతా గాయాలై రక్తం కారుతున్నా… అతనిలోని పోరాట పటిమ రవ్వంతైనా తగ్గలేదు.ఆ గాయాల నొప్పితోనే అతను ఏమంటున్నాడో వినండి…మేము అమరవీరులం… ఇలాంటి దెబ్బలు తింటూనే ఉంటాం… దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూనే ఉంటాం… మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో మేమూ చూస్తాం! గుండెల్ని కదిలించే ఆ పవర్ఫుల్ విజువల్ను ఇప్పుడు చూద్దాం.
పార్లమెంట్ పరిసరాల్లో ఉన్న వేలాది మంది విద్యార్థుల ఆగ్రహం ఏ స్థాయికి చేరిందో తెలుసుకోవడానికి…ఇప్పుడు నేను చూపించబోయే వీడియోనే నిదర్శనం. పోలీసుల భద్రతా వలయాలను చీల్చుకుంటూ… కొంతమంది విద్యార్థులు ఏకంగా పార్లమెంట్ ప్రాంగణంలోకి దూసుకెళ్లారు! నిజానికి… 2001 పార్లమెంట్పై ఉగ్రదాడి తర్వాత, భద్రతా వ్యవస్థ ఇంతలా కుప్పకూలడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు!పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే…భద్రతా కారణాల దృష్ట్యా పార్లమెంట్ మెయిన్ గేట్లన్నింటినీ మూసేశారు.ఒక దశలో పరిస్థితి చేయి దాటిపోవడంతో…సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థుల వైపు తుపాకులు గురి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది!ఇవి మామూలు విజువల్స్ కావు…అత్యంత ఆందోళనకరమైన దృశ్యాలు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత…ఇలాంటి ఉగ్రరూపం దాల్చిన విద్యార్థి నిరసనను ఢిల్లీ ఎప్పుడూ చూడలేదు.
నేను చూపించిన విజువల్స్ను ఒకసారి గమనించండి.విద్యార్థుల నిరసనతో మీరు ఏకీభవించవచ్చు..లేదా విభేదించవచ్చు.కానీ, ఈ వీడియోలో ఉన్న దృశ్యాలు మాత్రం అందరినీ కదిలిస్తాయి…ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఘర్షణల కంటే… చర్చలే గొప్ప మేలుచేస్తాయి.జంతర్ మంతర్ దగ్గర గత 23 రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారు.ప్రభుత్వానికి నిరసనను వ్యతిరేకించే అధికారం ఉండొచ్చు…కానీ ప్రజల గోడు వినాల్సిన బాధ్యత కూడా ఉంది.
గుర్తుంచుకోండి… ప్రభుత్వాలు వినడం మానేసినప్పుడు, వీధులే మాట్లాడటం మొదలుపెడతాయి. ఈ రోజు మనం చూస్తున్న దృశ్యాలే దానికి నిదర్శనం.ఇంకొక ముఖ్య విషయం.ఇది ఏదో సాదాసీదా రాజకీయ నిరసన కాదు.ఇది పూర్తిగా ‘జెన్-జీ’ పోరాటం.ప్రతిదీ రికార్డ్ చేసే తరం… అన్నింటినీ ప్రశ్నించే తరం… మౌనంగా ఉండటం అస్సలు తెలియని తరం.అధికారంలో ఉన్నవాళ్లు జెన్-జీ శక్తిని తక్కువ అంచనా వేయకూడదు.ఎందుకంటే ప్రతి తరం చరిత్రలో ఒక ముద్ర వేస్తుంది.బహుశా…ఈ రోజు మనం…చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని చూస్తున్నాం!









