
IPL 2027 : ఇండియన్ క్రికెట్ లెజెండ్, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ లో సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఐపీఎల్ 2027 సీజన్ నుండి ఆయన ఓ పవర్ఫుల్ ఫ్రాంచైజీకి కోచింగ్ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ స్టాఫ్లోకి రాబోతున్నారు అండ్ ఆయనకు తోడుగా యువరాజ్ సింగ్ను కూడా ఈ టీమ్ డగౌట్లోకి తీసుకురావాలని గంగూలీ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఐపీఎల్ 2027 నుండి ఢిల్లీ ఫ్రాంచైజీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ను JSW గ్రూప్ చేతుల్లోకి తీసుకోబోతుండడంతో ఈ సడన్ చేంజెస్ జరుగుతున్నాయి. యువరాజ్ సింగ్ ఈ టీంలో జాయిన్ అవ్వడం దాదాపు ఖాయమే అని ఒక సీనియర్ డీసీ ఆఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేశారు.
మరీ నిలకడలేకుండా ఆడి
ఐపీఎల్ 2025 , 2026 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ పర్ఫార్మెన్స్ అస్సలు బాలేదు. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో.. కెఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, అండ్ కుల్దీప్ యాదవ్ లాంటి స్టార్ ప్లేయర్స్ టీంలో ఉన్నప్పటికీ డీసీ కనీసం ప్లేఆఫ్స్ కు కూడా క్వాలిఫై అవ్వలేకపోయింది. ఐపీఎల్ 2025 లో మొదట్లో బాగానే ఆడినా సెకండ్ హాఫ్లో విఫలమై 5వ ప్లేస్తో సరిపెట్టుకుంది. ఇక ఐపీఎల్ 2026 లో అయితే మరీ నిలకడలేకుండా ఆడి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. ఈ వరుస ఫెయిల్యూర్స్ వల్ల ప్రెసెంట్ హెడ్ కోచ్ హేమంగ్ బదాని పొజిషన్ రిస్క్లో పడింది. దీంతో 2027 లో గంగూలీ మళ్లీ టీమ్ బాధ్యతలు అందుకోబోతున్నారు అండ్ యువరాజ్ సింగ్ను కూడా సపోర్ట్ స్టాఫ్లోకి చేర్చుకుని ఢిల్లీ క్యాపిటల్స్ టీంను మళ్లీ ట్రాక్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. మరోవైపు, ఈ ఏడాది జరిగిన ఎస్ఏ20 టోర్నమెంట్లో గంగూలీ ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్గా ఉండి ఆ టీంను ఫైనల్స్ వరకు నడిపించిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది.









